100 కేజీల బెల్లం,2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

by Naveena |
100 కేజీల బెల్లం,2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
X

దిశ, గరిడేపల్లి : సారా పట్టుబడడంతో 100 కేజీల బెల్లం, 2ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న సంఘటన బుధవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం మండల పరిధిలోని కాల్వపల్లి గ్రామంలో జరిగింది. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాల్వపల్లి గ్రామానికి దుగ్గి శ్రీనివాస్ తన ద్విచక్ర వాహనంపై సుమారు 3 లీటర్ల సారా ,50కేజీల బెల్లం తరలిస్తుండడంతో పట్టుబడి చేశామన్నారు. హుజూర్ నగర్ మండలానికి చెందిన షేక్ అబ్దుల్లా ద్విచక్ర వాహనంపై 50 కేజీల బెల్లం తరలిస్తుండడంతో.. గరిడేపల్లి మండలం రాయినిగూడెం వద్ద పట్టుకొని బెల్లం స్వాధీనం చేసుకోవడంతో పాటు వాహనాలను సీజ్ చేశామన్నారు. అలాగే నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ వెన్నెల,సిబ్బంది నాగయ్య,నాగరాజు, రవి కుమార్,బాలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed