- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
'ఆ రావణుడి వల్లే కాలేదు'.. ఉదయనిధి వ్యాఖ్యలపై సీఎం యోగి కౌంటర్
లక్నో: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లక్నోలో నిర్వహించిన క్రిష్ణాష్టమి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని అంతం చేయడం ఆ రావణుడి వల్లే కాలేదని, ఇక ఈ రాజకీయ పరాన్న జీవుల వల్ల ఏమవుతుందని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రశ్నించారు. ‘కొత్త శక్తి, నూతనోత్సాహంతో మన దేశం సరైన దిశలో పురోగమిస్తుండటం కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ఠ, స్థాయి పెరుగుతుండటం వాళ్లకు నచ్చట్లేదు. అందుకే, అభివృద్ధిని ఆపేందుకు, దేశాన్ని బలహీనపర్చేందుకు కొందరు మన సనాతన ధర్మం వైపు వేళ్లు చూపిస్తున్నారు. కానీ, వాళ్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ఆ రావణుడు కూడా తన అహంకారంతో సనాతన ధర్మాన్ని నాశనం చేయలేకపోయాడు. చరిత్రలో బాబర్, ఔరంగజేబుల దురాగతాలను సైతం సనాతన ధర్మం ఎదుర్కొని, చెక్కు చెదరకుండా బయటపడింది. అలాంటిది, ఈ రాజకీయ పరాన్నజీవులు సనాతనాన్ని ఎలా నిర్మూలించగలవు’ అని యోగి మండిపడ్డారు.