RBI: దివ్యాంగులకు చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేయాలని కోరిన ఆర్‌బీఐ

by S Gopi |
RBI: దివ్యాంగులకు చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేయాలని కోరిన ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ పేమెంట్ ప్రొవైడర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలను సమీక్షించాలని, దాని ఆధారంగా చెల్లింపుల వ్యవస్థలో అవసరమైన మార్పులను చేయాలని కోరింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యంగా దివ్యాంగులకు సమర్థవంతమైన యాక్సెస్‌ను అందించేందుకు వారికి చెల్లింపుల వ్యవస్థలు, పరికరాలను సమీక్షించాలని సూచించింది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ పేమెంట్ ప్రొవైడర్లు తమ చెల్లింపుల వ్యవస్థలు, పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్‌ల వంటి పరికరాలను దివ్యాంగులు సులభంగా యాక్సెస్ చేసే, ఉపయోగించే సవరణలు చేయాలని పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన యాక్సెసబిలిటీ ప్రమాణాలను సూచించాలని ఆర్‌బీఐ తెలిపింది. అలాగే, చెల్లింపుల వ్యవస్థలో చేసిన మార్పుల గురించి ఆర్‌బీఐకి తెలియజేసేందుకు నెల రోజుల సమయం ఉంటుందని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed