టూ వీలర్‌ కొనుగోలుదారులకు షాక్‌.. వచ్చే నెల నుంచి ఆ కంపెనీ వెహికిల్స్ ధరల పెంపు

by Prasad Jukanti |   ( Updated:2024-06-24 09:40:52.0  )
టూ వీలర్‌ కొనుగోలుదారులకు షాక్‌.. వచ్చే నెల నుంచి ఆ కంపెనీ వెహికిల్స్ ధరల పెంపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టూ వీలర్‌ కొనుగోలుదారులకు ప్రముఖ దిచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ షాకింగ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల నుంచి తన వాహనాల ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. జులై 1 నుంచి ఎంపిక చేసిన టూ వీలర్ మోడల్స్ వాహనాలపై గరిష్టంగా రూ. 1500 వరకు ధరలను పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ సోమవారం వెల్లడించింది. ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు ధరల పెరుగుదల ప్రభావంతోనే ఈ ధరలు పెంచాల్సి వస్తోందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. మోడల్ ను బట్టి, మార్కెట్ ను బట్టి ఈ పెంపు ఉంటుందని పేర్కొంది. కాగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హీరో టూవీలర్ వాహనాల విక్రయాలు తగ్గాయి. 2023 మే నెలలో 519,474 యూనిట్లు విక్రయించగా మే 2024 లో 498,123 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. స్కూటర్, మోటార్‌సైకిల్ విభాగాల్లో ఈ క్షిణత కనిపించింది.

Advertisement

Next Story

Most Viewed