Prime Minister:తెలుగు వారికి ‘తెలుగు భాషా దినోత్సవ’ శుభాకాంక్షలు:పీఎం మోడీ

by Jakkula Mamatha |
Prime Minister:తెలుగు వారికి ‘తెలుగు భాషా దినోత్సవ’ శుభాకాంక్షలు:పీఎం మోడీ
X

దిశ,వెబ్‌డెస్క్:తెలుగు భాష మాధుర్యం గురించి ఎంత చెప్పిన తక్కువే. తేనే కన్నా తీయనైనది మన తెలుగు భాష. అయితే నేడు(ఆగస్ట్ 29) తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు, తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ..తెలుగు చాలా గొప్ప భాష అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుకు మంచి స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు. తెలుగును మరింత ప్రాచుర్యం లోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. వాడుక భాషోద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా నేడు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం మన అందరికీ తెలిసిందే. మనం ప్రతి యేటా ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము. తెలుగు తీయదనాన్ని సామాన్యులకు చేరువ చేసేందుకు గిడుగు రామమూర్తి గారు ఎనలేని కృషి చేశారు.

Advertisement

Next Story

Most Viewed