- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఓబీసీ రిజర్వేషన్లు 27శాతానికి పెంపు..
అహ్మదాబాద్: పంచాయతీ, అర్బన్ లోకల్ బాడీస్లో ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీ) రిజర్వేషన్ను 10శాతం నుంచి 27శాతానికి పెంచుతున్నట్టు గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. రాష్ట్ర జనాభాలో 52శాతంగా ఉన్న ఓబీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను పెంచాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలలో ఓబీసీలకు రిజర్వేషన్లను నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వం జూన్ 9న ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేఎస్ ఝవేరిని నియమించింది.
మరోవైపు, ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న కాంగ్రెస్ గాంధీనగర్లో ఇక రోజంతా నిరాహారదీక్ష నిర్వహించింది. ఈ క్రమంలోనే కేఎస్ ఝవేరీ సూచన మేరకు గుజరాత్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల పెంపు ప్రకటనతో రాష్ట్రంలోని 7000 గ్రామ పంచాయతీలు, రెండు జిల్లా పంచాయతీలు, 70 మున్సిపాలిటీలకు ఎన్నికలకు మార్గం సుగమం కానుంది.