- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Dehradun: ఉత్తరాఖండ్ లో బాలికపైన సామూహిక అత్యాచారం..!
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్ లో బాలికపైన సామూహిక అత్యాచారం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్కు చెందిన బాలికపై ఉత్తరాఖండ్లో గ్యాంగ్ రేప్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 12 అర్ధరాత్రి ఘటన జరిగిందని డెహ్రాడూన్ పోలీసులు పేర్కొన్నారు. ఆగస్టు 12న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ రోడ్వేస్ బస్సులో బాలిక డెహ్రాడూన్ చేరుకుంది. అర్ధరాత్రి సమయంలో ఐఎస్బీటీ దగ్గర ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, వైద్యనివేదికలు మాత్రం ఇంకా రాలేదు. బస్సు డ్రైవర్, కండెక్టర్ సహా ఆరుగురిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. నివేదికల తర్వాతే ఇతర వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
సీడబ్ల్యూసీ సూపర్ వైజర్ ఏమన్నారంటే?
ఈ ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) సూపర్వైజర్ సరోజిని స్పందించారు. ఆగస్టు 12న రాత్రి 2 గంటల ప్రాంతంలో బాలిక దిక్కుతోచని స్థితిలో కన్పించిందని వెల్లడించారు. బాలిక మానసిక పరిస్థిత సరిగ్గా లేదని.. శరీరంపైనా గాయాలతో కన్పించినట్లు తెలిపారు. అయితే, ఆమెకు ఇంకా ఎక్కడ గాయాలయ్యాయో వైద్యనివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తోందన్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో డెహ్రాడూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) ఈ విషయంపై వైద్య నివేదిక వస్తేనే ఇతర విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు.