- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Tamil Nadu: వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం..
by Vinod kumar |
X
చెన్నయ్: అవయవ దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు. అవయవదానం విషయంలో తమిళనాడు రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని ఆయన తాజా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు వందలాది మంది రోగులకు నూతనోత్సాహం చేకూరిందని తెలిపారు.
విపత్కర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చిన కుటుంబాల నిస్వార్థ త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. అవయవ దాతలు, వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని పురస్కరించుకుని అంత్యక్రియలకు రాష్ట్రప్రభుత్వం తరఫున గౌరవ వందనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు.
Advertisement
Next Story