Tamil Nadu: వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం..

by Vinod kumar |
Tamil Nadu: వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం..
X

చెన్నయ్: అవయవ దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు. అవయవదానం విషయంలో తమిళనాడు రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని ఆయన తాజా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు వందలాది మంది రోగులకు నూతనోత్సాహం చేకూరిందని తెలిపారు.

విపత్కర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చిన కుటుంబాల నిస్వార్థ త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. అవయవ దాతలు, వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని పురస్కరించుకుని అంత్యక్రియలకు రాష్ట్రప్రభుత్వం తరఫున గౌరవ వందనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు.

Advertisement

Next Story