కేంద్రం కీలక నిర్ణయం.. వాటిపై జీఎస్టీ తగ్గింపు

by Mahesh |   ( Updated:2024-09-09 15:38:13.0  )
కేంద్రం కీలక నిర్ణయం.. వాటిపై జీఎస్టీ తగ్గింపు
X

దిశ, వెబ్ డెస్క్: సోమవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ సంబంధింత మెడిసిన్ పై జీఎస్టీ తగ్గించాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. క్యాన్సర్ మందులపై ఇది వరకు 12 శాతం జీఎస్టీ ఉండగా.. ప్రస్తుతం దానిని 5 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. అలాగే నమ్కీన్ పై కూడా 18 శాతం ఉన్న జీఎస్టీని 12 శాతానికి తగ్గించారు. అలాగే రీసెర్చ్ సెంటర్లపై పూర్తిగా జీఎస్టీని తొలగించినట్టు తెలిపారు. తాజాగా సవరించిన జీఎస్టీ రేట్లతో క్యాన్సర్ చికిత్స ఖర్చలు మరింత తగ్గుతాయని ఆమె తెలిపారు. అలాగే హెల్త్ ఇన్స్‌రెన్స్ లపై జీఎస్టీ తగ్గించాలని కౌన్సిల్ సభ్యులందరు ఏకాభిప్రాయం తెలిపారని.. నవంబర్‌లో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. ఇదే నిజమైతే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించనుంది.

Advertisement

Next Story

Most Viewed