గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

by Rajesh |
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుగా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. సోమవారం ఉదయం అహ్మదాబాద్-వడోదరా ఎక్స్‌‌వేపై వేగంగా వెళ్తున్న ట్రక్కు, బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగు మృతి చెందగా.. మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు వేకువజామున 4.30 గంటలకు అహ్మదాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story