కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..ఓ ఉగ్రవాది హతం

by samatah |
కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..ఓ ఉగ్రవాది హతం
X

దిశ, నేషనల్ బ్యూరో: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యడు. రాజ్ పోరా ప్రాంతంలోని ఫ్రెస్సిపోరా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు అక్కడ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఆర్మీ జవాన్లపైకి కాల్పులకు తెగపడ్డారు. దీంతో బలగాలు సైతం ఎదురు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలోనే ఓ ఉగ్రవాది మృతి చెందాడు. ఉగ్రవాదిని పుల్వామా జిల్లాకు చెందిన హరీస్ నజీర్‌గా భద్రతా బలగాలు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే దీనిని అధికారుల ధ్రువీకరించలేదు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. అంతకుముందు, పుల్వామాలోని అరిహాల్ గ్రామంలో గతేడాది డిసెంబర్ లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరగగా అందులో ఒక ఉగ్రవాది మరణించాడు.



Next Story