Kashmir : తొలుత నియోజకవర్గాల పునర్విభజన.. ఆ తర్వాతే పోల్స్ : కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్

by Hajipasha |
Kashmir  : తొలుత నియోజకవర్గాల పునర్విభజన.. ఆ తర్వాతే పోల్స్ : కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్
X

దిశ, నేషనల్ బ్యూరో : సాధ్యమైనంత త్వరగా జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘తొలుత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. చివరగా తగిన సమయంలో కశ్మీర్‌కు రాష్ట్రహోదా దక్కుతుంది’’ అని ఆయన వెల్లడించారు.

దీనిపై ఆగస్టు 5న పార్లమెంటు వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటన చేశారని.. ఆ మేరకు ప్రక్రియ ముందుకు సాగుతుందని లెఫ్టినెంట్ గవర్నర్ స్పష్టంచేశారు. ఆదివారం రోజు జమ్మూ యూనివర్సిటీలో మాలవ్య మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్‌‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈవివరాలను వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed