- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
తమిళనాడులో రచ్చకెక్కిన దేవాదాయశాఖ vs దీక్షితుల వర్గం పంచాయితీ
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలోనే ప్రముఖ దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన తమిళనాడులో వింత పరిస్థితి నెలకొంది. తమిళనాడు దేవాదాయశాఖకు దీక్షితుల వర్గానికి మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన చిదంబర నటరాజస్వామి ఆలయ సంపద విషయంలో ఇరు వర్గాలకు వివాదం మొదలైంది. ఆలయానికి సంబంధించిన కోట్ల విలువైన భూములను దీక్షితుల వర్గం తెగనమ్ముకున్నారని దేవాదాయశాఖ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు దీక్షితుల వర్గం తీవ్రంగా ఖండించినప్పటికీ.. పంచాయితీ అక్కడితో ఆగిపోలేదు. దీక్షితుల వర్గం అమ్ముకున్న ఆలయ భూముల పూర్తి వివరాలతో తమిళనాడు హైకోర్టులో కేసు వేసింది దేవాదాయశాఖ. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ధర్మాసనం దీక్షితుల వర్గానికి నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను నవంబర్ 14కి వాయిదా వేసింది.
Advertisement
Next Story