ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల హక్కులను కాంగ్రెస్ లాక్కోవాలని చూస్తోంది: ప్రధాని మోడీ

by Dishanational1 |
ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల హక్కులను కాంగ్రెస్ లాక్కోవాలని చూస్తోంది: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల హక్కులను రహస్యంగా లాక్కోవడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపణలు చేశారు. గురువారం ఆగ్రాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీల హక్కులను రహస్యంగా దోచుకుందని, ఆ తర్వాత దేశంలో తాము అధికారంలోకి వచ్చిన ప్రతిచోటా ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలతో కూడా అదే పని చేయాలని చూస్తోందన్నారు. 'కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికి రాత్రే ముస్లిం కులాలన్నింటినీ ఓబీసీలుగా మార్చి, ఓబీసీల హక్కులను దోచుకుంది. దేశంలో ఎక్కడ అవకాశం దొరికినా అదే పని చేయాలనుకుంటోంది. యూపీలోనూ ఇదే తరహా కోసం ప్రయత్నాలు చేస్తోంది. అక్రమ మార్గంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో కోత విధించి వారి హక్కులను దొడ్డిదారిన దోచుకోవాలనుకుంటున్నారు. కోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ మత ఆధారిత రిజర్వేషన్లను సమర్థిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. ఈ విషయంలో సమాజ్‌వాదీ పార్టీ పూర్తిగా కాంగ్రెస్‌కు వంత మోడీ విమర్శించారు.



Next Story

Most Viewed