- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
'మేం అలా చెప్పలేదు.. అన్ని సీట్లకు సిద్ధం కావాలని మాత్రమే చెప్పాం'
న్యూఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని లోక్ సభ సీట్లలోనూ పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు ఆ పార్టీ నేతలు కొందరు ప్రకటించడం, ఇదే నిజమైతే ఇండియా కూటమిలో కొనసాగడం వృథా అని 'ఆప్' తెగేసి చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు వివరణ ఇచ్చారు. ఏడు లోక్ సభ సీట్లలోనూ పోటీ చేస్తామని తాము చెప్పలేదని, అన్ని సీట్లకు సిద్ధం కావాలని మాత్రమే చెప్పామని హస్తం పార్టీ నేత సందీప్ దీక్షిత్ శుక్రవారం స్పష్టం చేశారు. ఏ పార్టీ అయినా సరే పొత్తులు ఉన్నా, లేకపోయినా పోటీకి సిద్ధం కావాల్సి ఉంటుందన్నారు. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలతో సీట్ల పంపకంపై కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఇటీవల ఏఐసీసీ కార్యాలయంలో ఢిల్లీ యూనిట్తో జరిపిన సమావేశంలో పార్టీ బలోపేతంపై చర్చించామన్నారు. కూటమి గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదని పేర్కొన్నారు. "ఆప్ను విశ్వసించలేమనేదే మా వాదన. వారి రాజకీయాల్లో అవినీతి అనేది ఉంది'' అని సందీప్ దీక్షిత్ కామెంట్ చేశారు. దీనికి ముందు, కాంగ్రెస్ నేత అల్కా లంబా ఒక ప్రకటనలో ఢిల్లీలోని ఏడు సీట్లలోనూ కాంగ్రెస్ పోటీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. దీనిపైనే ఆప్ మండిపడింది.