- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
కాంగ్రెస్ దళితులను అవమానించింది : అమిత్ షా
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ దళితులను అవమానించింది అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హరియాణా(Hariyana) అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన అమిత్ షా.. కాంగ్రెస్ పూర్తిగా దళిత వ్యతిరేక పార్టీ అన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న దళిత నేతలైన కుమారి సెల్జా, అశోక్ తన్వార్ లకు అసెంబ్లీ టికెట్ల నిరాకరణ కాంగ్రెస్ పార్టీకి గల దళిత వ్యతిరేకతకు అతి పెద్ద ఉదాహరణగా పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేసిన రిజర్వేషన్ల వ్యాఖ్యలను సభలో ప్రస్తావిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే భారత్ లోని ఎస్సీలు, ఓబీసీల రిజర్వేషన్లను కాపాడగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. హరియాణాను దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టడానికి బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నారు.
Next Story