వాళ్ళపై నమ్మకం లేదు : బెంగాల్ ఘటన మృతురాలి తండ్రి

by M.Rajitha |
వాళ్ళపై నమ్మకం లేదు : బెంగాల్ ఘటన మృతురాలి తండ్రి
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా లోని ఆర్జీ మెడికల్ కాలేజీలో జరిగిన డాక్టర్ పై హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆదివారం మీడియా సమావేశంలో మృతురాలి తండ్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం పోయిందన్నారు. ఘటన జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు సీఎం మమతా బెనర్జీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. మొదట మాకు సీఎం మాటల మీద నమ్మకం ఉండేది, కానీ సీఎం కేవలం మాటల మనిషి మాత్రమే అని తేలిపోయిందన్నారు. మమతా బెనర్జీ చర్యలు చేపడతాం అని అంటారు కానీ ఏమీ చేయరు అని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ అధికారులే మా కూతురుకు జరిగిన అన్యాయానికి తగిన న్యాయం చేయాలని వేడుకుంటున్నాని అన్నారు. కాగా ఈ కేసులో ఆదివారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. స్వయంగా సుప్రీం కోర్ట్ ఈ కేసును సుమోటోగా తీసుకుంది. ఈ నెల 20న ఈ కేసుపై విచారణ చేపడతామని సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తెలియజేశారు.

Next Story

Most Viewed