- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
పోర్షే యాక్సిడెంట్ కేసులో మైనర్కు బెయిల్.. జువైనల్ హోం నుంచి రిలీజ్ చేయాలని ఆదేశాలు
దిశ, నేషనల్ బ్యూరో: పూణె పోర్షే ప్రమాదం కేసులో నిందితుడైన మైనర్కు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. జువైనల్ హోం నుంచి వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అబ్జర్వేషన్ హోమ్లో కొనసాగించడం చట్టవిరుద్ధమని అభిప్రాయపడింది. నేరం ఎంత తీవ్రమైందయినా ఇతర పిల్లలతో ఎలా వ్యవహరిస్తామో అలాగే నిందితుడితో కూడా వ్యవహరించాలని న్యాయమూర్తులు భారతి డాంగ్రే, మంజుషా దేశ్పాండేలతో కూడిన ధర్మాసనం తెలిపింది. నిందితుడి బందువులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు ఆర్డర్స్ జారీ చేసింది. నిందితుడి వయస్సు18 ఏళ్లలోపు ఉన్నందున అబ్జర్వేషన్ హోంకు పంపాలన్న జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాలను కొట్టి వేసింది. కాగా, మే 19 అర్ధరాత్రి పూణేలోని కళ్యాణి నగర్ ప్రాంతంలో ఐటీ సెక్టార్లో పనిచేస్తున్న ఓ అబ్బాయి, అమ్మాయిని మైనర్ నిందితులు కారుతో ఢీకొట్టడంతో వారిద్దరూ మరణించిన విషయం తెలిసిందే.