BJP : బీజేపీలోకి పెద్దసంఖ్యలో ముస్లింలు.. కొత్తగా 4.12 లక్షల మంది చేరిక

by Hajipasha |
BJP : బీజేపీలోకి పెద్దసంఖ్యలో ముస్లింలు.. కొత్తగా 4.12 లక్షల మంది చేరిక
X

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు పెద్దసంఖ్యలో కమలదళంలో చేరుతున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు డ్రైవ్‌ సెప్టెంబరు 17న ప్రారంభం కాగా, సెప్టెంబరు 30 నాటికే దాదాపు 4.12 లక్షల మందికిపైగా ముస్లింలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చివరిసారిగా యూపీలో 2014 సంవత్సరంలో బీజేపీ సభ్యత్వ నమోదు డ్రైవ్ నిర్వహించగా కేవలం 1.25 లక్షల మంది ముస్లింలు పార్టీలో చేరారు. అంటే ఈసారి అంతకంటే మూడు రెట్లు ఎక్కువ సంఖ్యలో ముస్లింలు బీజేపీలో చేరారన్న మాట.

ఈనెల 15న సభ్యత్వ నమోదు డ్రైవ్ ముగిసే సమయానికి బీజేపీలో చేరే ముస్లింల సంఖ్య 5 లక్షలు దాటే అవకాశం ఉందని యూపీ బీజేపీ ముస్లిం మోర్చా అధ్యక్షుడు కున్వర్ బాసిత్ అలీ తెలిపారు. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ముస్లింలతో నేరుగా కలుస్తున్నందు వల్లే ఇంత పెద్ద సంఖ్యలో చేరికలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed