యూసీసీని వ్యతిరేకించిన ముస్లిం పర్సనల్ లా బోర్డు

by Vinod kumar |
యూసీసీని వ్యతిరేకించిన ముస్లిం పర్సనల్ లా బోర్డు
X

న్యూఢిల్లీ: యూనిఫాం సివిల్ కోడ్ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, హక్కులను ఎత్తి చూపుతూ ముస్లిం పర్సనల్ లా బోర్డు బుధవారం లా కమిషన్ కు లేఖ అందజేసింది. యూసీసీకి సంబంధించి ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలను ఆహ్వానించిన లా కమిషన్ కార్యదర్శి తమ స్పందనను తెలియజేయాలని పర్సనల్ లా బోర్డును కోరారు. ఈ నేపథ్యంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు బుధవారం సమావేశమై యూసీసీని వ్యతిరేకించాలని తీర్మానించింది. ఈ మేరకు యూసీసీ అవసరం లేదని, దీన్ని ఎవరూ కోరడం లేదని ముస్లిం పర్సనల్ లా బోర్డు సెక్రటరీ జనరల్ లా కమిషన్ కు అందజేసిన లేఖలో తెలిపారు.

1991లో రూపొందించిన ప్రార్థనా స్థలాల చట్టాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని, మతమార్పిడి అనేది ‘మత స్వేచ్ఛ’కు సంబంధించినదని ముస్లిం పర్సనల్ లా స్పష్టం చేసింది. గతంలో యూసీసీని అమలు చేయాలని పర్సనల్ లా బోర్డు తన కార్యనిర్వాహక సమావేశంలో తీర్మానం చేయడం విశేషం. యూసీసీపై లా కమిషన్ ప్రతిపక్ష ఎంపీల అభిప్రాయం కూడా కోరింది.

యూసీసీ ఒక కుటుంబ చట్టానికి సంబంధించినది కాదని, సమాజంలోని ప్రతి మతం, కులం, సమాజానికి సంబంధించిన విషయాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే సమాజంలోని అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా యూసీసీ ఉండాలని ప్రతిపక్ష ఎంపీలు అభిప్రాయపడ్డారు. గత నాలుగేళ్లుగా చర్చనీయాంశమైన యూసీసీ గురించి ప్రధాని మోడీ ఇటీవల ఓ బహిరంగ సభలో ప్రస్తావించడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దేశం రెండు చట్టాలపై నడవదని, రాజ్యాంగ స్థాపక సూత్రాలు, ఆదర్శాలకు అనుగుణంగానే యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) ఉందని ప్రధాని మోడీ ఆ సభలో చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed