Uttar Pradesh: అగ్నిప్రమాదం పుకార్లు.. కదులుతున్న రైలు నుంచి దూకిన పలువురు

by Shamantha N |
Uttar Pradesh: అగ్నిప్రమాదం పుకార్లు.. కదులుతున్న రైలు నుంచి దూకిన పలువురు
X

దిశ, నేషనల్ బ్యూరో: అగ్నిప్రమాదం జరిగింద పుకార్లతో భయాందోళనకు గురైన ప్రయాణికులు కదులుతున్న రైలు నుంచే దూకేశారు. దీంతో, పలువురికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని బిల్ పూర్ సమీపంలో ఈ గఠన జరిగింది. హౌరా- అమృత్ సర్ ఎక్స్ ప్రెస్ రైలు బరేలీలోని బిల్ పూర్ స్టేషన్ కు చేరుకుంది. అయితే, అదే సమయంలో ఓ జనరల్ బోగీలో మంటలు వ్యాపించినట్లు వదంతలు వచ్చాయి. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు చైన్ లాగి రైలుని ఆపారు. ఆలోగా భయంతో పలువురు ప్రయాణికులు రైలు నుంచి కిందకు దూకేశారు. ఈప్రమాదంలో పలువురికి గాయాలయ్యయాయి. ఈ విషయాన్ని రైల్వే పోలీసులు వెల్లడించారు. అయితే, రైలులోని కొందరు ఫైర్ యాక్సిడెంట్ కోసం వాడే ఎక్విప్ మెంట్ ని వాడినట్లు పేర్కొన్నారు. దీంతో, మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు భావించారని తెలిపారు. ఆ భయంతోనే కదులుతున్న రైలు నుంచి కిందికి దూకేసినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

Advertisement

Next Story