G-20 Summit: ఢిల్లీలో మూడు రోజులు లాక్ డౌన్.. కారణం ఇదే

by Vinod kumar |   ( Updated:2023-08-30 14:52:21.0  )
G-20 Summit: ఢిల్లీలో మూడు రోజులు లాక్ డౌన్.. కారణం ఇదే
X

న్యూఢిల్లీ : జీ-20 దేశాల సదస్సుకు వేదికగా నిలువనున్న ఢిల్లీ నగరంలో మూడు రోజుల లాక్ డౌన్‌ను ప్రకటించారు. సదస్సును పకడ్బందీగా నిర్వహించే ప్రణాళికలో భాగంగానే సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు లాక్ డౌన్ విధించాలని నిర్ణయించామని ఢిల్లీ ప్రభుత్వ లేబర్ కమిషనర్ కార్యాలయం ప్రకటించింది. ఈమేరకు మార్గదర్శకాలతో వ్యాపారులు, ప్రైవేటు సంస్థల నిర్వహకులందరికీ బుధవారం ఒక నోటీసును జారీ చేసింది. న్యూఢిల్లీ పరిధిలోని అన్ని దుకాణాలు, వాణిజ్య సంస్థలు ఆ మూడు రోజుల పాటు మూసివేయాలని తెలిపింది.

లాక్ డౌన్ అమలయ్యే మూడు రోజుల కోసం ఉద్యోగులు లేదా కార్మికులకు వేతనంతో కూడిన సెలవు (పెయిడ్ హాలిడే)ను మంజూరు చేయాలని వ్యాపార సంస్థలు, వివిధ రంగాల కార్యాలయాల నిర్వాహకులకు లేబర్ కమిషనర్ నిర్దేశించారు. ఈ మూడు రోజుల పాటు ఢిల్లీలోని స్కూల్స్, కాలేజీలు కూడా మూతపడనున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేయనుండటంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed