ప్రాణం తీసిన సముద్ర స్నానం..

by srinivas |
ప్రాణం తీసిన సముద్ర స్నానం..
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి తుమ్మలపేట సముద్ర తీరంలో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. యూపీ నుంచి కావలికి వలస కూలీలుగా వచ్చిన మురళీలాల్, రామశిత్తు అనే మిత్రులు సరదాగా స్నానం చేద్దామని సముద్ర తీరానికి వెళ్లారు.

ఈ క్రమంలోనే నీటిలోకి వెళ్లిన మురళీలాల్ అలల ఉధృతికి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని తోటి మిత్రుని నుంచి వివరాలు సేకరించారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Next Story

Most Viewed