వరద బాధితులకు విరాళం ప్రకటించిన విశ్వక్ సేన్.. అభిమాని ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే

by Anjali |   ( Updated:2024-09-03 14:52:48.0  )
వరద బాధితులకు విరాళం ప్రకటించిన విశ్వక్ సేన్.. అభిమాని ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. వర్సం నీటితో ఇళ్లన్ని నీట మునిగి.. తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఏపీలోని పలు ప్రాంతాల్లోని ప్రజలకు తిండి కూడా తినలేని పరిస్థితి నెలకొంది. కొంతమంది ఈ వర్షాల కారణంగా మృతిచెందుతున్నారు. మరొకొంతమంది వరదలో కొట్టుకుపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారులు దగ్గరుండి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పలువురు సినీ ఇండస్ట్రీ వారు అండ్ రాజకీయ నాయకులు వరద బాధికులకు విరాళం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్(తెలంగాణకు 50 లక్షల రూపాయలు-ఏపీకి రూ. 50లక్షలు), బన్నీ వాసు, తీన్మార్ మల్లన్న(ఒక్కరోజు జీతం)వంటి వారు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ గొప్ప మనసు చాటుకున్నారు. ఏపీ-తెలంగాణకు చెరి 5 లక్షలు విరాళంగా ఇస్తానని ట్వీట్ చేశారు. తారక్ విరాళం ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే ఈ యంగ్ హీరో ట్వీట్ చేయడంతో అభిమాని బాటలో విశ్వక్ సేన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఫస్ట్ నుంచే తాను ఎన్టీఆర్ ఫ్యాన్ అంటూ చెప్పుకొస్తాడన్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed