తరుణ్ భాస్కర్ "ఇడుపు కాయితం"... ఆశ్చర్యపోయిన ఇండస్ట్రీ

by M.Rajitha |
తరుణ్ భాస్కర్ ఇడుపు కాయితం... ఆశ్చర్యపోయిన ఇండస్ట్రీ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సినిమాలతో అనేక హిట్లు అందుకున్న అగ్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ చేసిన ప్రకటన ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేసింది. ‘ఇడుపు కాయితం’ (విడాకులపత్రం) అంటూ విడుదల చేసిన ఓ 50 రూపాయల బాండ్ పేపర్ చర్చనీయాంశంగా మారింది. ఇండస్ట్రీ షాక్ అయ్యేలా చేసిన ఆ ప్రకటన విషయంలో అసలు విషయం ఏంటంటే... ఆరోస్ సినిమాస్ & డోలాముఖి సబాలటర్న్ ఫిల్మ్స్ వారు నిర్మించబోతున్న ఓ సినిమాకి కాస్టింగ్ కాల్ కు సంబంధించిన ప్రకటన అది. తరుణ్ భాస్కర్ నటిస్తున్న ఈ సినిమాను వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తుండగా, ౠసం జగన్ మోహన్ రెడ్డి, వేణు ఊడుగుల నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు 20 నుంచి 60 ఏళ్ల వయసు గల నటీనటులు తమ పోర్ట్ ఫోలియోస్ పంపాలని ఆ బాండ్ సారాంశం.

Next Story

Most Viewed