Simbu : రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన తమిళ్ హీరో శింబు

by Prasanna |   ( Updated:2024-09-10 14:12:19.0  )
Simbu : రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన తమిళ్ హీరో శింబు
X

దిశ, వెబ్ డెస్క్ : అకాల వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన భారీ వరదలకు విజయవాడ, ఖమ్మంలో ఇళ్ళన్నీ మునిగిపోయాయి. ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా జలమయ్యాయి. దీని వలన ప్రజలు ఎక్కడికి వెళ్లలేక.. తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు. అయితే, వరద బాధితుల కోసం తెలుగు సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు ఇలా ఎంతో మంది రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి విరాళాలు భారీగా ఇస్తున్నారు.

ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన హీరోలు ప్రజలకు సహాయం చేయడంలో ముందుంటారు. ఇతర రాష్ట్రాల్లో ఏదైనా జరిగినా మన హీరోలు స్పందిస్తారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా జరిగితే బయటి రాష్ట్రాల వారు ఎవ్వరూ కూడా సహాయం చేయరు. అయితే, తాజాగా తమిళ హీరో శింబు వరదలలో చిక్కుకున్న భాదితుల కోసం రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి భారీ విరాళం ఇచ్చాడు. శింబు తెలుగులో వల్లభ, మన్మధ.. లాంటి మూవీస్ చేసిన విషయం మనకు సంగతి తెలిసిందే. మూడు లక్షల చొప్పున మొత్తం ఆరు లక్షలు విరాళంగా ప్రకటించారు. దీంతో తెలుగు శింబు అభిమానులు అభినందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed