- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
హీరో సిద్ధార్థ్ పేరు చెప్పి టోకరా.. రూ. 50 లక్షలు మోసపోయిన ఫ్యాన్ గర్ల్..
దిశ, సినిమా: సోషల్ మీడియా కారణంగా లాభం పొందేది కొందరైతే నష్టపోయేది ఇంకొందరు. ఈ నష్టపోయిన లిస్ట్ లోనే చేరింది హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఫ్యాన్ గర్ల్. అది కూడా ఈ కథానాయకుడి ఫ్యాన్ పేజ్ చేసిన మోసమే కావడం విశేషం. అమెరికాలో ఉంటున్న మీనూ వాసుదేవ తన అభిమాన హీరో ఫ్యాన్ పేజ్ ఫాలో అవుతుంది. ఈ క్రమంలో పేజ్ అడ్మిన్ తో ఇంటరాక్ట్ కాగా సిద్ధు ఆపదలో ఉన్నాడని.. తనపై బ్లాక్ మ్యాజిక్ జరిగిందని చెప్పాడు. కియారతో పెళ్లి ఒత్తిడితోనే జరిగిందని వివరించాడు. దీని నుంచి బయటపడాలంటే డబ్బులు కావాలని తెలిపాడు. సిద్ధుతో కూడా మాట్లాడిస్తానని రూ. 50లక్షలు నొక్కేశాడు. దీనిపై ప్రతి వీక్ అప్డేట్ ఇస్తానని నమ్మించాడు. కానీ ఆ తర్వాత రెస్పాన్స్ ఇవ్వలేదు. దీంతో మోసపోయానని తెలుసుకున్న మీను.. ఆన్లైన్ లో ఢిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది.
దీంతో ఈ న్యూస్ వైరల్ కాగా స్పందించిన హీరో సిద్ధార్థ్ .. తన ఫ్యామిలీ, తను ఇలాంటివి అసలు ఎంకరేజ్ చేయమని చెప్పాడు. తన పేరు చెప్పి మోసం చేసిన వ్యక్తులకు సరైన బుద్ధి చెప్పాలని అన్నాడు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ నోట్ షేర్ చేశాడు. ఇక ఈ న్యూస్ తెలిసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోతున్నారు.