- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
ఓటీటీలోకి పొలిటికల్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
దిశ, సినిమా: వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ సినీ కెరీర్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు నారా రోహిత్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘ప్రతినిధి 2’. మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. 2014లో రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘ప్రతినిధి’ మూవీకి సీక్వెల్గా వచ్చింది. పార్ట్ 1 సూపర్ సక్సెస్ కావడంతో.. పార్ట్-2 భారీ అంచనాల మధ్య మే నెలలో థియేటర్లలో రిలీజైంది. అయితే.. మొదటి భాగం ఆకట్టుకున్నంతగా.. రెండవ భాగం ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో బాక్సీఫీస్ వద్ద పరాజయం పొందింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ప్రతినిధి-2 డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. కానీ స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇవ్వలేదు. ఇక అందుతున్న సమాచారం మేరకు ‘ప్రతిని ధి-2’ సెప్టెంబర్ 27న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.