- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఆమెతో నా ప్రయాణం ఎప్పటికీ స్పెషల్గానే ఉంటుంది: నాగచైతన్య
![ఆమెతో నా ప్రయాణం ఎప్పటికీ స్పెషల్గానే ఉంటుంది: నాగచైతన్య ఆమెతో నా ప్రయాణం ఎప్పటికీ స్పెషల్గానే ఉంటుంది: నాగచైతన్య](https://www.dishadaily.com/h-upload/2024/07/04/348864-naga.webp)
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి దాదాపు 15ఏళ్లు పూర్తవుతుంది. నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతు.. ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కటి కూడా సొంతం చేసుకోలేకపోయాడు. అయినప్పటికీ వరుస సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఇక గతేడాది ‘కస్టడీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలు మధ్య ఈ సినిమా కూడా ఈ హీరోకి అంతగా కలిసి రాలేదు. ఇక ప్రజెంట్ చందుమొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ చిత్రం చేస్తున్న చైతన్య.. త్వరలోనే కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్కినేని హీరో తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.
చెన్నైలో పుట్టిపెరిగిన ఆయన డిగ్రీ చదివే సమయానికి హైదరాబాద్కి వచ్చేశారు. ఇక డిగ్రీ చదువుతున్న సమయంలో సమ్మర్ వెకేషన్కి ముంబై వెళ్లి ఎంజాయ్ చేసేవాడట. ఇక చిన్నప్పుడు తన తల్లితో ట్రైన్లో ముంబైకి వెళ్లి.. మరోసారి తల్లితో పాటు హైదరాబాద్కు ట్రైన్ జర్నీ చేశారట. ఈ రెండుసార్ల ప్రయాణం నాకు ఎప్పటికే స్పెషల్గానే ఉంటాయని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ప్రపంచంలో ఎన్ని ప్రాంతాల్లో తిరిగినా, ఎన్ని మిస్ అయినా, చివరకి నా రిటైర్మెంట్ టైంకి గోవాలోనే సెటిల్ అవుతా. 45 ఏళ్లు వచ్చాక పూర్తిగా గోవాకి షిఫ్ట్ అయిపోయి.. ఏడాదొక సినిమా తీసుకుంటూ అక్కడే పూర్తిగా ఉండిపోవాలి అనుకుంటున్నాను అని తెలిపాడు నాగచైతన్య.