బాలీవుడ్ నటి కంగనాకు బిగ్ షాక్..!

by M.Rajitha |
బాలీవుడ్ నటి కంగనాకు బిగ్ షాక్..!
X

దిశ,వెబ్ డెస్క్ : నటి, లోక్ సభ ఎంపీ కంగనా రనౌత్ కు మధ్యప్రదేశ్ హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. అయితే కంగనా స్వయంగా దర్శకత్వం వహించి, నటించిన 'ఎమర్జెన్సీ' సినిమాపై పలు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ బోర్డు నుండి అనుమతులు పొందక విడదల ఆగిపోగా.. ఈ సినిమాలో చాలా సున్నితమైన అంశాలు ఉండటం వల్లే అనుమతులు ఇవ్వలేదని బోర్డు వివరణ ఇచ్చింది. కాగా మధ్యప్రదేశ్ లో ఈ సినిమాపై పలు కేసులు నమోదు కాగా, పలువురు ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో.. ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలంటూ హైకోర్ట్ కంగనాకు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి ఏదోక రకంగా వార్తల్లో ఉంటూ వస్తున్న కంగనా.. ఎట్టకేలకు సినిమా పూర్తి చేసి, సెప్టెంబర్ 6న సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లూ చేయగా అది కాస్తా సెన్సార్ సర్టిఫికెట్ రాక ఆగిపోయింది. బోర్డు సభ్యులను బెదిరించడం వల్లే వారు అలా మాట్లాడుతున్నారని మరోవైపు కంగనా ఆరోపిస్తోంది. కాగా ఈ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను కంగన పోషించగా.. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ, ఇందిరా గాంధీ హత్య నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని సినిమా వర్గాల సమాచారం.

Next Story

Most Viewed