కోకాపేట్‌లో అక్రమ నిర్మాణాల పై కొరడా

by Mahesh |
కోకాపేట్‌లో అక్రమ నిర్మాణాల పై కొరడా
X

దిశ, గండిపేట్: గండిపేట మండలంలోని నార్సింగి మున్సిపల్ పరిధిలోని కోకాపేట సర్వే నెంబర్ 147 లో అక్రమ నిర్మాణాలు చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. దీంతో గండిపేట మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్ఐలు సురేష్, విక్రం రెడ్డి పోలీసుల బందోబస్తుతొ కోకాపేట్ సర్వేనెంబర్ 147 లో నిర్మించిన ఎనిమిది అక్రమ కట్టడాలను (దాదాపు 1000 గజాల స్థలం ఉంటుంది) జేసీబీ సహాయంతో పూర్తిగా నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసిన ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేస్తే ఇక క్రిమినల్ కేసులు పెడతామని ఆ నిర్మాణదారులను హెచ్చరించారు. అలాగే మరికొన్ని ప్లాట్లు నిర్మించినట్లు గుర్తించామని, అవి కోర్టు కేసులో ఉన్నప్పటికీ వారికి నోటీసులు ఇస్తున్నామని తదుపరి కూల్చివేతలు చేపడతామని వారు తెలిపారు. ఇకముందు ప్రభుత్వ స్థలాలలో నిర్మాణాలు చేస్తే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed