టాలీవుడ్‌ సొంతిళ్లు అయితే, బాలీవుడ్ పొరుగు ఇల్లు: జేడీ చక్రవర్తి కామెంట్స్ వైరల్!

by Anjali |
టాలీవుడ్‌ సొంతిళ్లు అయితే, బాలీవుడ్ పొరుగు ఇల్లు: జేడీ చక్రవర్తి కామెంట్స్ వైరల్!
X

దిశ, వెబ్‌డెస్క్: అప్పట్లో హీరోగా, విలన్‌గా కీలక పాత్రల్లో నటించి.. ప్రేక్షకుల మెప్పు పొందారు జేడీ చక్రవర్తి. ‘సత్య, మనీ, గులాబీ, బొంబాయి ప్రియుడు’ వంటి సినిమాల్లో అద్భుతంగా నటించారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ‘దయా’ అనే వెబ్ సిరీస్‌‌లో కనిపించనున్నారు. ఇది ఈ నెల(ఆగస్టు 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ హీరో తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరై.. తెలుగులో గ్యాప్‌పై స్పందించారు. ‘టాలీవుడ్‌ సొంతిళ్లు అయితే, బాలీవుడ్ నాకు పొరుగు ఇల్లు లాంటిది. అందుకే కొంతకాలం అటువైపు వెళ్లి వచ్చాను. నా బలం మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీనే. అందుకే మళ్లీ ఇక్కడ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఇండస్ట్రీలో డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది.

ఇక్కడ ఫామ్‌లో ఉన్నవారికే ఛాన్స్‌లు ఉంటాయి. బాలీవుడ్‌ వెళ్లడం వల్ల తెలుగులో ఆఫర్లు తగ్గడానికి ఓ కారణమే. దీనికితోడు నేను సెలక్టీవ్‌గా ఉండటం వల్ల ఇక్కడ గ్యాప్‌ వస్తుంది.’’ అంటూ జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చారు. అలాగే ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన ‘దయా’ వెబ్ సిరీస్ గురించి కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Read More: BRO : మంత్రి అంబటి వివాదంపై పూనమ్ కౌర్, వర్మ వైరల్ ట్వీట్స్..

Next Story

Most Viewed