మాటల్లో చెప్పలేను నిన్ను చాలా మిస్ అయ్యాను.. నయనతార ఎమోషనల్ పోస్ట్

by Disha Web Desk 6 |
మాటల్లో చెప్పలేను నిన్ను చాలా మిస్ అయ్యాను.. నయనతార ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. వారికి ఉయిర్, ఉలగం అనే పేర్లు పెట్టారు. ఇక నయనతార వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే విఘ్నేష్ కూడా పలు చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ క్యూట్ కపుల్ సమయం దొరికినప్పుడల్లా తమ ఇద్దరు పిల్లలతో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ఫొటోలను, వీడియోలను నయనతార తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

అయితే ఇటీవల విఘ్నేష్ శివన్ ఏల్ఐసీ అనే చిత్ర షూటింగ్‌లో భాగంగా సింగపూర్‌కు వెళ్లాడు. దాదాపు అక్కడే 20 రోజుల పాటు ఉండి షూట్ పూర్తి చేసుకుని వచ్చాడు. ఈ క్రమంలో.. తాజాగా, నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని తెలుపుతూ.. ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ 20 రోజుల ఎదురుచూపుల తర్వాత నిన్ను చూస్తుంటే మాకెంతో సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేము. నిన్ను ఎంతో మిస్ అయ్యాం’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా భర్తను తన పిల్లలతో రిసీవ్ చేసుకున్న ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు క్యూట్ ఫ్యామిలీ అంటూ హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.


Next Story

Most Viewed