Mahesh Babu అభిమానులకు గుడ్‌ న్యూస్.. ‘Guntur Kaaram’ అప్డేట్

by GSrikanth |   ( Updated:2023-08-09 15:33:08.0  )
Mahesh Babu అభిమానులకు గుడ్‌ న్యూస్.. ‘Guntur Kaaram’ అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం గుంటూరు కారం. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా అప్‌డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్రబృందం శుభవార్త చెప్పింది. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. బీడి తాగుతూ.. ఇంటి ఎదుట లుంగీ కట్టుకొని కూర్చున్న ప్రిన్స్ లుక్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. కాగా, వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read: ఈ వారం OTTలో విడులయ్యే సినిమాలు ఇవే

Advertisement

Next Story