ప్రభాస్ ‘కల్కి’ సినిమాపై ఎన్నికల ఎఫెక్ట్.. చర్చనీయాంశంగా మారిన నిర్మాత పోస్ట్!

by Hamsa |   ( Updated:2024-05-11 14:45:27.0  )
ప్రభాస్ ‘కల్కి’ సినిమాపై ఎన్నికల ఎఫెక్ట్.. చర్చనీయాంశంగా మారిన నిర్మాత పోస్ట్!
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో ‘కల్కి ఏడి 2898’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ స్టార్ట్ అయి చాలా రోజులే అవుతున్నప్పటికీ రిలీజ్ కాకపోవడంతో అందరి దృష్టి ఈ సినిమాపైనే పడింది. అయితే ఇప్పటికే ఇందులోంచి విడుదలైన అప్డేట్స్ కల్కిపై భారీ అంచనాలను పెంచాయి. దీంతో ఫ్యాన్స్ ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

కానీ వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఇటీవల కల్కి మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. జూన్ 27న రాబోతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఎలక్షన్స్ రావడంతో ఓటు వేయడానికి కల్కికి పనిచేసే వారు కూడా పోతున్నారు. దీంతో షూటింగ్‌పై ప్రభావం పడింది. తాజాగా, ఈ విషయాన్ని నిర్మాత స్వప్న దత్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అంతేకాకుండా నాగ్ ఆశ్విన్‌తో ఉన్న ఫొటోను కూడా పోస్ట్‌లో పెట్టింది.

కల్కి సినిమాకు సీజ్ వర్క్ చేసేవారు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్నారు అని నాగ్ అశ్విన్ అనగా.. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారని స్వప్న అడుగుతుంది. దీనికి డైరెక్టర్.. ఎవరు గెలిచినా నాకు అనవసరం కానీ నా సీజ్ షాట్స్ ఎప్పుడు వస్తాయో అదే నాకు కావాలి అని అంటాడు. ఇదంతా స్వప్న పోస్ట్‌లో వివరించడంతో అది చూసిన నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. షూటింగ్ కనీసం రెండు మూడు రోజులైన ఆగిపోతుంది. కాబట్టి రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశం ఉందేమో అని అంటున్నారు.

Read More...

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పిఠాపురం ప్రజలకు ప్రభాస్ పెద్దమ్మ కీలక మెసేజ్ (వీడియో)



Advertisement

Next Story