కార్తీ, తిరుమల లడ్డు వివాదంపై మళ్ళీ మాట్లాడిన డిప్యూటీ సీఎం.. కార్తీ, సూర్య ఇద్దరూ కూడా..

by Kavitha |
కార్తీ, తిరుమల లడ్డు వివాదంపై మళ్ళీ మాట్లాడిన డిప్యూటీ సీఎం.. కార్తీ, సూర్య ఇద్దరూ కూడా..
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా తిరుమల లడ్డూ వివాదం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. ఇక లడ్డూ విషయంలో పవన్ ముందుండి మాట్లాడుతున్నారు. అయితే సత్యం సుందరం సినిమా ఈవెంట్లో కార్తీని లడ్డూ గురించి ప్రశ్న వేసినప్పుడు.. ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడొద్దు, సెన్సిటివ్ టాపిక్ అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడం, చుట్టూ ఉన్నవాళ్లు నవ్వడంతో ఈ వీడియో కాస్త వైరల్ అయి పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళింది. దీంతో పవన్ కార్తీని అలా మాట్లాడొద్దు అంటూ కామెంట్ చేయడం, దానికి కార్తీ సారి చెప్పడం, పవన్ మళ్ళీ అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ కార్తీకి రిప్లై ఇవ్వడం జరిగాయి. ఇలా కార్తీ – పవన్ – లడ్డు వివాదం తెలుగుతో పాటు తమిళ రాష్ట్రంలోనూ వైరల్ అయింది. అయితే కొంతమంది తమిళ్ వాళ్ళు కార్తీ తప్పేం లేదంటూ పవన్‌ని విమర్శించారు.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఓ తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్‌కి కార్తీ గురించి ప్రశ్న ఎదురవడంతో మళ్ళీ ఆ వివాదంపై స్పందించారు. పవన్ మాట్లాడుతూ.. “కార్తీ, సూర్య ఇద్దరూ భక్తులే, వాళ్ళు కూడా తిరుమలకు వెళ్లారు. కార్తీ గారు కావాలని అలా మాట్లాడలేదు. కానీ అయన అనుకోకుండా అలా మాట్లాడటం, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వడంతో అలాంటి ఇష్యూ మీద నెగిటివ్‌గా వెళ్ళింది. వాళ్ళు సెలబ్రిటీ పర్సన్స్ కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మనల్ని చూసి ప్రజలు ఫాలో అవుతారు. అందుకే ఆ రోజు అలా స్పందించాను. తమిళ సినీ పరిశ్రమ నాకు బ్రదర్స్ లాంటి వాళ్ళు” అని చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం. దీంతో పవన్ చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్ అయ్యాయి.

Next Story