దర్శకురాలికి బిగ్ షాక్.. నెట్‌ఫ్లిక్స్, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

by Anjali |
దర్శకురాలికి బిగ్ షాక్.. నెట్‌ఫ్లిక్స్, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు
X

దిశ, సినిమా: జార్ఖండ్‌లో 13 ఏళ్ల బాలికపై ముగ్గురు కుర్రాళ్లు లైంగిక దాడి చేసి దారుణంగా చంపాలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఎలాగోలా బయటపడ్డ బాలిక.. తనకు జరిగిన అన్యాయంపై ఎలాగైన పోరాడాలని నిర్ణయించుకుంది. గ్రామస్థులంతా ఈ ఘటనపై వ్యతిరేకంగా మాట్లాడిన తండ్రీకూతుళ్లు ఇద్దరు పోరాటం చేశారు. చివరికి ‘ఏ కిల్ ఏ టైగర్’ అనే టైటిల్‌లో డ్యాకుమెంటరీ తీశారు. దీనికి నిషా పహూజా దర్శకత్వం వహించారు. ఈ డ్యాకుమెంటరీ 2024 ఆస్కార్‌కు నామినేట్ కూడా అయ్యింది.

చట్టాన్ని ఉల్లంఘించి.. ఈ డ్యాకుమెంటరీలో రేప్ బాధితురాలి గుర్తింపును తెలిపినందుకు తాజాగా ఢిల్లీ హైకోర్టు డైరెక్టర్ అండ్, నెట్‌ఫ్లిక్స్‌లై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ పిటిషన్ పై సూచనల కోసం కాస్త టైమ్ తీసుకుంటామని కేంద్రం తరపున లాయర్ కోరారు. బాలిక తల్లిదండ్రుల అంగీకారంతోనే ఈ డ్యాకుమెంటరీ తీశారని నెట్‌ఫ్లిక్స్ తరపు న్యాయవాది వాదించారు. దీంతో నాలుగు వారాల్లో కోర్టుకు సరైన సమాధానం చెప్పాలని హైకోర్లు డ్యాకుమెంటరీ దర్శకురాలు నిషా పహుజా, నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed