మూవీ లవర్స్ కు బంపరాఫర్.. మల్టీప్లెక్స్‌ థియేటర్లలో ఉచితంగా టీ, సమోసాలు

by Prasanna |
మూవీ లవర్స్ కు బంపరాఫర్.. మల్టీప్లెక్స్‌ థియేటర్లలో ఉచితంగా టీ, సమోసాలు
X

దిశ, సినిమా: కరోనా తర్వాత నుంచి థియేటర్లలకి వెళ్లి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గింది స్టార్ హీరో సినిమా అయితేనే ముందుగా బుక్ చేసుకుని వెళ్తున్నారు. మూవీ మేకర్స్ ప్రమోషన్స్ కోసం ఎంత కష్ట పడుతున్నా ఆడియెన్స్ ను మాత్రం థియేటర్లకు రప్పించలేకపోతున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో సతమవుతున్నాడు. ముఖ్యంగా కరోనా తర్వాత నుంచి ఇతను నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ లుగా నిలిచాయి. తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘సర్ఫిరా’ రిలీజ్ అయింది. అయితే, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా కలెక్షన్స్ వసూలు చేసింది. కోట్లు పెట్టి నిర్మించినా ఈ మూవీని చూడటానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

దీంతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేందుకు మల్టీప్లెక్స్‌లు కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మూవీ చూడటానికి వచ్చిన ఆడియెన్స్ స్నాక్స్ ఫ్రీ గా ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. కథ కనెక్ట్ అయితే పెద్ద సినిమాలు మొదటి రోజే కలెక్ట్ చేయాలి. కానీ ‘సర్ఫిరా’ సినిమా ఫస్ట్ డే రూ.2.50 కోట్లు, రెండో రోజు రూ.4.50 కోట్లు వసూలు చేసింది. దీనికోసం మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కు టీ, సమోసాలను ఆఫర్ చేసింది. ‘పీవీఆర్ ఐనాక్స్’ మల్టీప్లెక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా వెల్లడించింది. సర్ఫిరా మూవీ చూసేందుకు వెళ్లే వారికి 2 సమోసాలు, 1 టీ, 1 లగేజీ ట్యాగ్ ఫ్రీ గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed