Allu Arjun: జాతీయ అవార్డుతో అల్లు అర్జున్‌కు పెరిగిన పారితోషికం!

by Vinod kumar |   ( Updated:2023-08-29 13:08:13.0  )
Allu Arjun: జాతీయ అవార్డుతో అల్లు అర్జున్‌కు పెరిగిన పారితోషికం!
X

దిశ, సినిమా: ‘పుష్ప’ సినిమా కోసం అల్లు అర్జున్‌‌కు ఉత్తమనటుడిగా జాతీయ అవార్డు లభించిన విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ఒక సినిమా ద్వారా భారీ సక్సెస్‌ని సాధిస్తే హీరో లేదా హీరోయిన్‌‌కు పారితోషికం పెరుగుతుంది. అయితే ఈ జాతీయ అవార్డు రాకతో బన్నీకి బాధ్యత మరింత పెరిగింది. ఇప్పటికే ‘పుష్ప 2’ కోసం పారితోషికం డిసైడ్‌ అయి ఉంటుంది. కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం.. బన్నీకి తదుపరి సినిమాకు రూ. 125 కోట్ల నుంచి రూ. 150 కోట్ల పారితోషికం ఇవ్వాలని నిర్ణయించారట. ప్రస్తుతం బన్నీ చేతిలో ‘పుష్ప 2’ మాత్రమే ఉంది. మరిన్ని మూవీస్ కమిట్ అయినట్లుగా వార్తలు వచ్చినప్పటికీ వాటి గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.

Read More: ఊహకందని రేంజ్‌‌లో ‘సలార్‌’ బిజినెస్‌.. నైజాంలో ఎన్ని కోట్లు పలికిందో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed