సమంతపై కొండా సురేఖ వ్యాఖ్యల ఎఫెక్ట్.. నటి రకుల్ ప్రీత్ సింగ్ సంచలన పోస్ట్

by Gantepaka Srikanth |
సమంతపై కొండా సురేఖ వ్యాఖ్యల ఎఫెక్ట్.. నటి రకుల్ ప్రీత్ సింగ్ సంచలన పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కుటుంబం, నటి సమంత(Samantha)పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) చేసిన వ్యాఖ్యలు ఇటు రెండు రాష్ట్ర రాజకీయాల్లో అటు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై రాజకీయాలకు అంతీతంగా స్పందించి ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి సురేఖ సైతం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. తాజాగా.. ఈ అంశంపై ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు.

‘ఒక మహిళ గురించి మంత్రి హోదాలో ఉన్న మరో మహిళ అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం.. నాకు ఏ రాజకీయ నాయకుడితో, కానీ ఏ రాజకీయ పార్టీతో కానీ ఎలాంటి సంబంధం లేదు.. రాజకీయ లబ్ధి కోసం పొలిటికల్‌గా నా పేరును వాడుకోవడం ఇప్పటికైనా ఆపాలి’ అని నటి రకుల్ ప్రీత్ సింగ్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని పిటిషన్‌‌లో పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read More....

మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన స్టార్ హీరో.. సెన్సేషనల్ కామెంట్స్!



Next Story