సీఎం కేసీఆర్, మంత్రులపై సీతక్క హాట్ కామెంట్స్

by  |
సీఎం కేసీఆర్, మంత్రులపై సీతక్క హాట్ కామెంట్స్
X

దిశ, ములుగు: కరోనా సమయంలో అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాలు, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సోకిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ప్రైవేటు ఆసుపత్రికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెండుగా ఉన్నాయంటున్న వారే కార్పొరేట్ వైద్యం తీసుకోవడం ఏంటన్నారు. ఈ విషయంపై ప్రజలందరూ కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని.. ఉచిత వైద్య హక్కును సాధించుకోవాలని సీతక్క పిలుపునిచ్చారు.

Next Story