ప్రభుత్వ ధరలకే… ప్రైవేటు వైద్యం

by  |
ప్రభుత్వ ధరలకే… ప్రైవేటు వైద్యం
X

దిశ, మిర్యాలగూడ: ప్రభుత్వ ధరకే ప్రైవేటు వైద్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు అన్నారు. ఆదివారం మిర్యాలగూడలో ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కరోనాతో ఎవరూ భయపడవద్దని, ధైర్యంతో మంచి ఆహార అలవాట్లతో ఉండేవారు త్వరగా కోలుకుంటారని తెలిపారు. ఏరియా ఆస్పత్రిలో ప్రతిరోజూ రెండొందల కరోనా టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రైవేటు వైద్యం చేయించుకోవాలను కొనే వారు ప్రభుత్వ ధరలకే, వైద్యం చేయించుకోవాలని సూచించారు.


Next Story

Most Viewed