ఏపీలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు

by srinivas |
ఏపీలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,716 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 37 మంది కరోనాకు బలయ్యారు. కొత్త కేసుల్లో శ్రీకాకుళం జిల్లాలో 1444, గుంటూరు జిల్లాలో 1236, చిత్తూరు జిల్లాలో 1180, కర్నూలు జిల్లాలో 958, నెల్లూరు జిల్లాలో 934, అనంతపురం జిల్లాలో 849, తూ,గో జిల్లాలో 830, విశాఖ జిల్లాలో 810, విజయనగరం జిల్లాలో 565, ప్రకాశం జిల్లాలో 294 కరోనా కేసులు నమోదయ్యాయి,

ఇక కృష్ణా జిల్లాలో 294, కడప జిల్లాలో 216, ప.గో జిల్లాలో 106 కేసులు నమోదయ్యాయి. మరణాల విషయానికొస్తే.. కృష్ణా జిల్లాలో 10 మంది, నెల్లూరు జిల్లాలో ఏడుగురు మృతి చెందారు. తూ.గో, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున మరణించారు.

Advertisement

Next Story

Most Viewed