మహేశ్@ 28 ఆ దర్శకుడితోనేనా?

by Anukaran |   ( Updated:2020-08-04 03:40:15.0  )
మహేశ్@ 28 ఆ దర్శకుడితోనేనా?
X

సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కృష్ణ పుట్టినరోజు సందర్భరంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు మహేశ్ లుక్‌ను రివీల్ చేసింది చిత్రబృందం. అప్పటి నుంచి ఇంతవరకు సినిమా గురించి మరో అప్‌డేట్ రాలేదు. దాంతో మహేశ్ పుట్టినరోజున సూపర్ స్టార్ అభిమానులకు కచ్చితంగా ఓ సూపర్ విజువల్ ట్రీట్ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. అలాగే ప్రిన్స్ నెక్ట్స్ మూవీ అప్‌డేట్ కూడా అదే రోజు వస్తుందని సమాచారం.

‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ‘గీత గోవిందం’తో మంచి హిట్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి కూడా సూపర్ స్టార్‌తో తన నెక్ట్స్ సినిమా ఉంటుందని తేల్చేశాడు. అయితే లాక్‌‌డౌన్‌ కారణంతో పాటు రాజమౌళికి కరోనా సోకడంతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ మరింత లేటయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ‘ఖైదీ’ దర్శకుడు లోకేష్ కనకరాజ్ పేరు తెరపైకి వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘మా నగరం, ఖైదీ, మాస్టర్’ వంటి సినిమాలు తెరకెక్కించిన లోకేష్‌తో మహేశ్ సినిమా చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో‌‌తో ‘మాస్టర్’ సినిమా రూపొందిస్తున్న లోకేష్.. తన తదుపరి సినిమా ‘మైత్రీ మూవీ మేకర్స్‌’తో చేయడానికి కమిట్ అయ్యారట. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీస్ వారు మహేశ్ – లోకేష్ కాంబినేషన్‌లో మూవీకి ప్లాన్స్ చేస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే.. ఆగస్టు 9 వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed