నిజామాబాద్‌లో టీఆర్ఎస్‌కు గుడ్ న్యూస్

by  |
నిజామాబాద్‌లో టీఆర్ఎస్‌కు గుడ్ న్యూస్
X

దిశ, నిజామాబాద్ రూరల్: ఎం డీసీసీబీ డైరెక్టర్ కొరట్పల్లి ఆనంద్ టీఆర్ఎస్ లో చేరారు. తన అనుచరులతో కలిసి శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, మాజీ ఎంపీటీసీ ముత్యం గంగాధర్ తో పాటు గంగపుత్ర సంఘం నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed