లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. ఇద్దరు ప్రాణాలు తీసింది..

by Sumithra |
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. ఇద్దరు ప్రాణాలు తీసింది..
X

దిశ‌, ఖ‌మ్మం : ర‌ఘ‌నాథ‌పాలెం మండ‌లంలోని ఎస్ఆర్ గార్టెన్ స‌మీపంలో బుధ‌వారం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. త‌నికెళ్ళ గ్రామానికి చెందిన జెరీపోతుల పుల్లారావు(29) త‌న వ‌దిన సంధ్యతో పాటు త‌న అన్న కోడుకు మ‌హ‌త్‌(5)ను బైక్‌పై ఖ‌మ్మం నుండి త‌నికెళ్ళకు తీసుకెళ్లున్నాడు. ఎస్ఆర్ గార్టెన్ స‌మీపంలో అతివేగంగా వెళ్తున్న లారీ బైక్‌ను ఢీకొంది.

ఈ ప్రమాదంలో పుల్లారావుతో పాటు అత‌ని అన్న కొడుకు అక్కడిక‌క్కడే మృతి చెందారు. సంధ్యకు తీవ్ర గాయాలు కావ‌డంతో ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌రలించారు. లారీ డ్రైవ‌ర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్లు స్థానికులు తెలిపారు. సంఘ‌ట‌న స్థలాన్ని ఖానాపురం పోలీసులు ప‌రిశీలించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

Next Story

Most Viewed