కుదిరిన బీజేపీతో పొత్తు.. కాకినాడ ఎంపీగా పవన్ కల్యాణ్ పోటీ

by GSrikanth |
కుదిరిన బీజేపీతో పొత్తు.. కాకినాడ ఎంపీగా పవన్ కల్యాణ్ పోటీ
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది. శనివారం ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం సీట్ల సర్దుబాటుపై ఉమ్మడిగా అధికారిక ప్రకటన చేశారు. మొత్తం జనసేన, బీజేపీకి 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేనకు 24, బీజేపీకి 6 అసెంబ్లీ స్థానాలు దక్కాయి.

అయితే ఇందులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. బీజేపీ పెద్దల సూచన మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. కాకినాడ పార్లమెంట్ నుంచి లోక్‌సభకు పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. పొత్తులో భాగంగాఅనకాపల్లి, రాజమంత్రి, ఏలూరు, అరకు, హిందూపురం, రాజంపేట నుంచి బీజేపీ పోటీ చేస్తుండగా.. కాకినాడ, మచిలీపట్నం, తిరుపతి లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. మచిలీపట్నం నుంచి ఎంపీ బాలశౌరి పోటీ చేయనున్నారు.

Read More..

వైజాగ్ నుంచి నేను.. అక్కడి నుంచి బాబు మోహన్ పోటీ చేస్తున్నాం : కేఏపాల్

Advertisement

Next Story

Most Viewed