First priestess of India: మనదేశంలోనే మొదటి పురోహితురాలు.. ఇంతకీ ఆమె ఎవరంటే?

by Kavitha |
First priestess of India: మనదేశంలోనే మొదటి పురోహితురాలు.. ఇంతకీ ఆమె ఎవరంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా మనం పెళ్లి లేదా ఇంట్లో, గుడిలో పురోహితుడే పూజలు చేయడం చూస్తుంటాం. కానీ పురోహితురాలని చూడటం చాలా అరుదు. అసలు చూడకుండా ఉన్నారు అని అనడంలో కూడా ఏమాత్రం అతియోశక్తి లేదు. ఎందుకంటే పూజారి అంటే కేవలం మగవాళ్లు మాత్రమే ఉండాలి. వాళ్లు మాత్రమే పూజలు చేయాలి అని మనమందరం భావిస్తున్నాము. మరి మహిళలు ఎందుకు ఉండకూడదు అంటే వారికి నెలసరి అవుతుంది. కాబట్టి అలా పీరియడ్స్ అయ్యే వాళ్లు పూజలు చేయకూడదని చాలామంది భావిస్తారు. అందులో భాగంగా కనీసం కొన్ని దేవాలయాల గర్భగుడిలకు మహిళలకు అనుమతి ఉండదు. దీనికి ముఖ్య కారణం పీరియడ్స్.

అయితే సాధారణంగా మనం ఎక్కువగా పెళ్లిళ్లు, అన్నప్రాశనలు, పూజలు, గృహప్రవేశం వంటి కార్యక్రమాలన్నీ పురుషులు చేయడం చూస్తుంటాం. దీనివల్ల పురోహితుడు మాత్రమే ఉంటారు. పురోహితురాలు ఉండరని మనం ఫిక్స్ అయిపోతాం. కానీ, మన దేశంలో ఓ పురోహితురాలు ఉంది. కలకత్తాకు చెందిన ఈమె దేశంలోనే మొదటి పురోహితురాలు. అసలు ఈమె ఎవరు? ఎందుకు పురోహితురాలుగా చేస్తోంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కలకత్తాకు చెందిన నందిని భౌమిక్ అనే మహిళ దాదాపు పదేళ్ల నుంచి పురోహితురాలిగా వ్యవహరిస్తు పూజలు, పెళ్లిళ్లు చేస్తుంది. సంస్కృతంలో డాక్టరేట్ చదివిన నందిని కుటుంబ బాధ్యతల కారణంగా ఉద్యోగం చేయలేకపోయింది. ఇంట్లో వాళ్లు ఆమెకు పెళ్లి చేసేశారు. అయితే అంతా బాగానే ఉన్నా.. ఓ సమస్య వచ్చింది. నందిని రెండవ కూతురికి వివాహం నిశ్చయమైంది. ఆ వివాహానికి ఆమెకు పురోహితుడు దొరకలేదు. పురోహితుడు కోసం ఎంతగానో వెతికారు. కానీ ఫలితం లేదు. దీంతో ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. ఎవరో ఎందుకు నేనే పెళ్లి చేస్తే ఏమవుతుందని భావించింది. దీంతో తన రెండవ కూతురి పెళ్లితో నందిని పురోహితురాలిగా మారింది. అప్పటి నుంచి ఆమె పురోహితురాలిగా వ్యవహరిస్తోంది. అయితే ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని పురుషులతో పాటు మహిళలు కూడా వ్యతిరేకించారు. కానీ అవన్నీ ఆమె పట్టించుకోకుండా ఆమె ముందుకు వెళ్లారు. ఇలా దేశంలోనే మొదటి పురోహితురాలిగా గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ప్రజలు ఆలోచన విధానంలో మార్పులు తీసుకురావాలని.. దాని కోసం కృషి చేస్తానని ఆమె అంటోంది. అయితే నందిని చేసే పెళ్లిలో కన్యాదానం చేయరు. ఎందుకంటే స్త్రీలను వస్తువులుగా పరిగణించే వాటిని ఆమె సపోర్ట్ చేయడానికి ఇష్టం లేదన్నారు. పెళ్లి కార్యక్రమాన్ని ఒక గంటలో ఆమె పూర్తి చేస్తారు. అయితే పురోహితురాలిగా చేరిన కొత్తలో ఆమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అమ్మాయివి నీకెందుకు ఇలాంటివి. మగవారు మాత్రమే పూజలు చేయాలి. మహిళలు ఇలాంటివి చేయకూడదనే మాటలు ఎక్కువగా విన్నారట. కానీ ఎప్పటికైనా దీనిని మార్చాలని ఆమె పట్టుదలతో అందులోనే ఉండిపోయారు. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Advertisement

Next Story

Most Viewed