విజయవాడ కలెక్టరేట్ ఎదట… వామపక్షాల ఆందోళన

by  |
విజయవాడ కలెక్టరేట్ ఎదట… వామపక్షాల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రైతులు రోడ్లమీదరకు వచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధులు పాల్గొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కలెక్టరేట్‌కు చేరుకొని, నిరసన కారులను, రైతులను అదుపులోకి తీసుకున్నారు.


Next Story

Most Viewed