దుబ్బాక ఉపఎన్నికపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్

by  |
దుబ్బాక ఉపఎన్నికపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
X

దిశ, వెబ్ డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికపై కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోందని ప్రకటించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కేసీఆర్ పై ఫైరయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. కరోనా అల్లకల్లోలం చేస్తుందన్నారు. నేతలు ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపితే కేసులతో వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. ఉప ఎన్నికలో ప్రజలు కేసీఆర్ కు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు.

కాగా, అనారోగ్యంతో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూసిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed